కరాచీ: పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ దీటుగా బదులిస్తున్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్లో 438 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (161), సల్మాన్ (103) సెంచరీలు చేయగా.. వెటరన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (86) రాణించాడు. కివీస్ బౌలర్లలో కొత్త కెప్టెన్ టిమ్ సౌథీ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ మంగళవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 165 పరుగులు చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్ (78 బ్యాటింగ్), కాన్వే (82 బ్యాటింగ్) అజేయ అర్ధశతకాలతో రాణించారు.