Nepal Cricket Team : నేపాల్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆ దేశ క్రికెట్ జట్టు ఈరోజు చరిత్ర సృష్టించింది. పసికూనగా భావించే ఆ జట్టు తొలిసారి ఆసియాకప్(Asia Cup 2023) పోటీలకు క్వాలిఫై అయింది. ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్(ACC Mens Premier cup) ఫైనల్లో యూఏఈ జట్టుని 7 వికెట్ల తేడాతో ఓడించిన నేపాల్ ఆసియాకప్ బెర్తు సాధించింది.
నేపాల్కు భారత్, పాకిస్థాన్ ఉన్న గ్రూప్లో చోటు దక్కింది. మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. గత ఏడాది ఆసియా కప్లో సత్తా చాటిన శ్రీలంక ఫైనల్లో పాకిస్థాన్ను ఓడించి కప్పు ఎగరేసుకుపోయింది. స్టార్లు ఉన్నా విఫలమైన భారత్ ఈసారి కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఉంది.
रातो र चन्द्र सुर्य
जङ्गी निशान हाम्रो !! 🇳🇵We are the CHAMPIONS of the #ACCPremierCup!
A day filled with pride and the players filled with passion!
Nepal beats UAE to progress through to the Asia Cup with a fantastic performance from Nepal.#NEPvUAE | #RoadToAsiaCup | #weCAN pic.twitter.com/lwtOsR8Q5e— CAN (@CricketNep) May 2, 2023
ఈ ఏడాది సెప్టెంబర్లో ఆసియా కప్ టోర్నమెంట్ జరగనుంది. అయితే.. ఈ టోర్నీ నిర్వహణపై భారత్, పాక్ దేశాల మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దాంతో, ఈసారి ఆసియా కప్ను తటస్థ వేదికపై నిర్వహిస్తారా? అనే సందేహం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. మామూలుగా షెడ్యూల్ ప్రకారం అయితే.. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాలి. కానీ, టీమిండియా ఎట్టిపరిస్థితుల్లోనే పాక్ గడ్డపై ఆడిది లేదని బీసీసీఐ(BCCI) సెక్రటరీ జై షా ఇప్పటికే తేల్చి చెప్పాడు. దాంతో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇండియా తమదేశంలో ఆడకుంటే తాము కూడా వన్డే వరల్డ్ కప్లో ఆడేది లేదని తెలిపింది. కానీ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం మాత్రం తమ జట్టు భారత్లో వరల్డ్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.