స్టాక్హోమ్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకంతో మెరిశాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్లో చోప్రా 89.94 మీటర్ల దూరం బల్లెం విసిరి తృటిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు(89.30మీ)ను చోప్రా అధిగమించాడు.
ఆరు సెంటీమీటర్ల తేడాతో 90మీటర్ల మార్క్ను చేజార్చుకున్న నీరజ్ తన నాలుగు ప్రయత్నాల్లో 84.37మీ, 87.46మీ, 84.77మీ, 86.67మీ, 86.84మీ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ప్రపంచ చాంపియన్ గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.31 మీటర్ల దూరంతో పసిడి దక్కించుకోగా, జులియన్ వెబర్ కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు.