న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ బృందానికి ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా నాయకత్వం వహించనున్నాడు. బర్మింగ్హామ్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీ కోసం భారత అథ్లెటిక్ ్స సమాఖ్య గురువారం 37 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో 18 మంది మహిళలు, 19 మంది పురుషులు ఉన్నారు. జావెలిన్ త్రోలో నీరజ్పై భారీ అంచనాలు ఉండగా.. స్ప్రింట్లో ద్యుతీచంద్, హిమాదాస్ బరిలో ఉన్నారు. తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి 100 మీటర్ల హర్డిల్స్లో చోటు దక్కించుకుంది.