Neeraj Chopra : అథ్లెటిక్స్లో భారత్కు తొలి పసిడి పతకం అందించిన నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరో ఘనత సాధించాడు. జావెలిన్ త్రో(Javelin Throw) ఆటకు వన్నె తెచ్చిన అతను పురుషుల విభాగంలో వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ విడుదల చేసిన ర్యాకింగ్స్లో 1455 పాయింట్లతో నీరజ్ అగ్రస్థానంలో నిలిచాడు. వరల్డ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ను వెనక్కి నెట్టి మొదటి ర్యాంక్ దక్కించుకున్నాడు.
ఈ ఏడాదిని 25 ఏళ్ల ఈ జావెలిన్ త్రోయర్ ఘనంగా ఆరంభించాడు. దోహాలో మే 5వ తేదీన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్లో గోల్డ్ మెడల్ గెలిచాడు. తొలి ప్రయత్నంలోనే అతను జావెలిన్ను 88.67 మీటర్ల దూరం విసిరాడు.
🇮🇳’s Golden Boy is now the World’s No. 1⃣ 🥳
Olympian @Neeraj_chopra1 attains the career-high rank to become World’s No. 1⃣ in Men’s Javelin Throw event 🥳
Many congratulations Neeraj! Keep making 🇮🇳 proud 🥳 pic.twitter.com/oSW9Sxz5oP
— SAI Media (@Media_SAI) May 22, 2023
1. నీరజ్ చోప్రా (భారత్) – 1455 పాయింట్లు
2. అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) – 1433 పాయింట్లు
3. జాకుబ్ వడ్లెచ్ (చెక్ రిపబ్లిక్) – 1416 పాయింట్లు
4. జులియన్ వెబెర్ (జర్మనీ) – 1385 పాయింట్లు
5. అర్షద్ నదీం (పాకిస్థాన్) – 1306 పాయింట్లు
ఒలింపిక్స్లో ఒకప్పుడు మన దేశానికి హాకీలో పసిడి పతకాలు వచ్చాయి. ఆ తర్వా బాక్సింగ్, రెజ్లింగ్, హాకీ, షూటింగ్ విభాగాల్లో యంగ్స్టర్స్ పతకాలు సాధించారు. అయితే.. 2020 టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ సంచలనం సృష్టించాడు. జావెలిన్ త్రోలో బంగారు పతకం గెలిచిన మువ్వన్నెల జెండాను మురిపెంగా గుండెలకు హత్తకున్నాడు. ఆక్షణం యావత్ భారతావని సంతోషంతో ఉప్పొంగిపోయింది.