ముంబై: రాబోయే 10-15 ఏండ్లలో మన దేశం క్రీడల్లో సూపర్ పవర్గా ఎదుగడం ఖాయమని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీలో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచిన నేపథ్యంలో సన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు. యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద చెస్ వరల్డ్కప్లో రన్నరప్గా నిలువడం, బ్యాడ్మింటన్ ప్రపంచ టోర్నీలో ప్రణయ్ కాంస్యంగెలువడం ఆనందంగా ఉందన్నాడు. ‘గతంలో దేశంలో కొన్ని ఆటలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత దక్కేది. రాబోయే కొన్నేండ్లలో భారత్ క్రీడా దేశంగా ఎదగడం ఖాయం’ అని గవాస్కర్ పేర్కొన్నాడు.