అబుదాబి: అత్యంత వేగంతో బంతులు వేసి సంచలనం సృష్టించిన ఉమ్రాన్ మాలిక్పై భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. జమ్ము కశ్మీర్కు చెందిన 21 ఏండ్ల ఉమ్రాన్ కోల్కతాతో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం మ్యాచ్ ఆడాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లోనూ 152.95 వేగంతో బంతులు వేసి మెరుపులు మెరిపించాడు. మాలిక్ బౌలింగ్పై కోహ్లీ స్పందిస్తూ.. ‘ప్రతి ఐపీఎల్ ప్రతిభావంతులను వెలుగులోకి తెస్తున్నది. ఉమ్రాన్ 150కి.మీ మించిన వేగంతో బంతులు వేయడం ఆనందించే విషయం. అని అన్నాడు.