న్యూయార్క్: టెన్నిస్ లెజెండరీ ప్లేయర్ మార్టినా నవ్రతిలోవా అందరికీ సుపరిచితమే. కానీ ప్రధాని మోదీ అంటే ఆమెకు నచ్చదు. మోదీని విమర్శించడంలో మార్టినా ముందుంటుంది. తాజాగా తన ట్విట్టర్లో నవ్రతిలోవా ఓ కామెంట్ చేసింది. ప్రధాని మోదీ నియంత కాదు, ఆయన ఓ ప్రజాస్వామ నేత అని ఇటీవల ఓ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై మార్టినా తన ట్విట్టర్లో స్పందించారు. ఇది తన తర్వాతి జోక్ అంటూ ఆ కామెంట్లను ట్వీట్ చేశారామె. అమెరికా టెన్నిస్ స్టార్ మార్టినా నవ్రతిలోవా మహిళ టెన్నిస్లో ఆల్టైమ్ గ్రేట్ ప్లేయర్గా ఉన్నారు. ఆమె ఖాతాలో 18 గ్రాండ్స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. దీంతో పాటు 31 మహిళల గ్రాండ్ స్టామ్ టైటిళ్లతో పాటు 10 మిక్స్డ్ డబుల్స్ టైటిళ్లు ఉన్నాయి. గతంలోనూ నవ్రతిలోవా ప్రధాని మోదీని విమర్శించారు. మోదీ, ట్రంప్ విధానాలను ఆమె తప్పుపట్టారు. రాజకీయ లబ్ధి కోసం ఆ ఇద్దరూ నిజాలను అణిచివేస్తారని ఆమె అన్నారు.