న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu) మంగళవారం తన ఫ్యామిలీతో రిషికేశ్ టూర్కు వెళ్లారు. భార్య నవజ్యోత్ కౌర్, కూతురు రబియా సిద్దూ, కుమారుడు కరణ్ సిద్దూతో కలిసి నవజ్యోత్ సింగ్ సిద్దూ పర్యటించారు. గంగా దసేరా సందర్భంగా రిషికేశ్ వెళ్లినట్లు సిద్దూ తన ట్వీట్లో తెలిపారు. తన భార్య నవజ్యోత్ కౌర్ కోరిక మేరకు రిషికేశ్ వెళ్లినట్లు చెప్పారు. గంగా దసేరా సందర్భంగా సిద్దూ ఫ్యామిలీ గంగా నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. గంగలో స్నానం చేస్తున్న ఫోటోను ఒకటి సిద్దూ పోస్టు చేశారు. దీంతో పాటు డైనింగ్ చేస్తున్న ఫోటోను కూడా ఆయన ట్వీట్ చేశారు.
Fulfilling my wife’s cherished desire……a dip in the holy Ganges on the auspicious occasion of Ganga Dussehra at Rishikesh !!
हर-हर गंगे, नमामि गंगे 🙏🏻 pic.twitter.com/yFclXWTufS
— Navjot Singh Sidhu (@sherryontopp) May 30, 2023