హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో హర్యానా స్టీలర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ అదరగొట్టింది. ఏమాత్రం ప్రతిఘటన కనిపించని మ్యాచ్లో ఆద్యంతం ఢిల్లీ హవా కొనసాగింది. ఢిల్లీ 42-30తో విజయం సాధించింది. ఢిల్లీ జట్టులో నవీన్ కుమార్ 15, అశు మాలిక్ 10, విజయ్ మాలిక్ 4, అమిత్, కిషన్ చెరి 3 పాయింట్లు సాధించగా, హర్యానా జట్టులో ప్రభంజన్ 9, మన్జీత్ 7, మీతు శర్మ 4, జైదీప్, మోహిత్ నందల్ చెరి 3 పాయింట్లు సాధించారు. ఉత్కంఠగా సాగిన మరో మ్యాచ్లో పుణెరి పల్టన్ రెండు పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. పల్టన్ 35-33తో నెగ్గి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పుణె జట్టులో మోహిత్ గోయత్ 9, ఆకాశ్ 7, అస్లామ్ 6, అభినేష్ 3 పాయింట్లు సాధించారు.