Navdeep Saini | భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు స్వాతి ఆస్థానాను వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి ఉదయ్పూర్లోని దేబారి ఆనందం రిస్టార్స్లో ఘనంగా జరిగింది. పంజాబీ ఆచారాల ప్రకారం.. ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వివాహ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అతిథులు హాజరయ్యారు.
నవదీప్ సైనీ హర్యానాలోని కర్నాల్ స్వస్థలం. దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ఆర్పీ సింగ్, రాహుల్ తెవాటియా సోషల్ మీడియాలో సైనీకి శుభాకాంక్షలు తెలిపారు. నవదీప్ సైనీ భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 2021 నుంచి జాతీయ జట్టులోకి ఎంపిక కాలేదు. కెరీర్లో ఇప్పటి వరకు రెండు టెస్టులు, ఎనిమిది వన్డేలు, 11 టీ20 ఇంటర్నేషనల్ బ్యాచ్లు ఆడాడు.
మొత్తం 32 మ్యాచుల్లో 23 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. స్వాతి ఆస్థానా ఫ్యాషన్, ట్రావెలర్ అండ్ లైఫ్ స్టయిల్ బ్లాగర్ కాగా.. సోషల్ మీడియాలో 82వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. స్వాతి ఆస్థానా తన యూట్యూబ్ ఛానెల్లో నిరంతరం వీడియోలను షేర్ చేస్తుంది. ఇది కాకుండా స్వాతి ఆస్థానా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఇద్దరు చాలాకాలంగా రిలేషన్షిప్లో ఉండగా.. తాజాగా పెళ్లి పీటలెక్కారు.