పెద్దవూర, ఫిబ్రవరి 15 : మహాశివరాత్రి, ఇద్దాసు(శివారాధన) ఆరాధనోత్సవాల్లో భాగంగా అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఇద్దాస్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్దవూర మండలం చింతపల్లిలో జాతీయస్థాయి మహిళల కబడ్డీ టోర్నీ బుధవారం మొదలైంది. ఈ పోటీలను నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భరత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామం చింతపల్లిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మొత్తం 18 రాష్ర్టాలు పోటీపడుతున్న టోర్నీలో ఆతిథ్య తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కేరళ, పంజాబ్, తమిళనాడు, సౌత్సెంట్రల్ రైల్వే, పశ్చిమబెంగాల్ జట్లు బరిలోకి దిగాయి. బుధవారం జరిగిన మ్యాచ్లో తెలంగాణ 10 పాయింట్ల తేడాతో ఏపీపై ఉత్కంఠ విజయం సాధించింది.