హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్(ఏఐఎస్టీఏ) ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా 26వ జీవీకే జాతీయ సీనియర్ టెన్నిస్ టోర్నీ సోమవారం ప్రారంభమైంది.
తొలి రోజు జరిగిన మ్యాచ్ల్లో అండర్-35 విభాగంలో బాలకృష్ణ 6-0, 6-0తో ఆరిఫ్పై అలవోకగా గెలువగా, అశోక్రెడ్డి 6-1, 6-0తో ప్రసాద్ను ఓడించాడు. ప్రారంభ కార్యక్రమంలో ఏఐఎస్టీఏ అధ్యక్షుడు జీవీ కృష్ణారెడ్డి, సాట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, టోర్నీ చైర్మన్ జస్టిస్ విజయసేన్రెడ్డి పాల్గొన్నారు.