హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ తైక్వాండో చాంపియన్షిప్లో దర్శన, రాపోలు పృథ్వీరాజ్ రజత పతకాలతో మెరిశారు. నాసిక్ వేదికగా జరిగిన టోర్నీలో మహిళల 46 కిలోల క్యొయోర్గీ విభాగంలో దర్శన అద్భుత ప్రదర్శన కనబరిచింది. సువాతి, అలీశ, రియాసింగ్ను ఓడిస్తూ దర్శన ద్వితీయ స్థానంలో నిలిచింది. పురుషుల 68కిలోల కేటగిరీలో పృథ్వీ..తనుదాస్, చేతన్కుమార్, గుప్తావిజయ్పై విజయాలతో రజతం సొంతం చేసుకున్నాడు.