పనాజీ: ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్కు రంగం సిద్ధమైంది. గోవా వేదికగా 37వ జాతీయ క్రీడలకు ఈ నెల 26న తెరలేవనుంది. 15 రోజుల పాటు 28 వేదికల్లో మొత్తం 43 క్రీడావిభాగాల్లో పోటీలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను గోవా సీఎం ప్రమోద్ సావంత్ శుక్రవారం మీడియా సమావేశంలో వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నేషనల్ గేమ్స్లో ఒలింపిక్స్ క్రీడలతో పాటు సంప్రదాయక ఆటలకు తొలిసారి చోటు కల్పించారు. ఈ సందర్భంగా సావంత్ మాట్లాడుతూ……గోవాలో స్పోర్టింగ్ ఇకో సిస్టమ్ను ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకెళుతున్నాం.అందమైన బీచ్ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న గోవా..క్రీడా ఔత్సాహికులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నది’ అని అన్నారు.