న్యూఢిల్లీ: తెలంగాణ క్రీడాకారుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో షిల్లాంగ్ (మేఘాలయ) వేదికగా జరిగిన సీనియర్ జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ మహిళల సింగిల్స్, డబుల్స్లో విజేతగా నిలిచింది. కానీ ఆమెకు ఇప్పటివరకు అందుకు సంబంధించిన నగదు బహుమతి అందలేదు. శ్రీజ డబుల్స్ భాగస్వామి అయిఖా ముఖర్జీకి నగదు బహుమతి అందింది. ఆ చాంపియన్షిప్లో విజేతలైన ఇతర టీటీ ఆటగాళ్లకు కూడా నగదు బహుమతులు దక్కాయి.. కానీ శ్రీజకు ఇప్పటివరకు అందుకు సంబంధించిన నగదు బహుమతి అందలేదు. తన నగదు బహుమతి విషయమై సీవోఏకు, మేఘాలయ టీటీ సంఘానికి ఉత్తరాలు రాసినా సమాధానం లేదని శ్రీజ తెలిపింది.