షిల్లాంగ్ : జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో ప్రపంచ చాంపియన్షిప్ రజత పతక విజేత అమిత్ పంగల్(51కి.), ఆరుసార్లు ఆసియన్ చాంపియన్షిప్ కైవసం చేసుకున్న శివ థాపా, 2021 ఆసియన్ చాంపియన్ సంజీత్(92కి.) సెమీఫైనల్స్కు చేరుకున్నారు. థాపా బౌట్ ఆద్యంతం ప్రత్యర్థి శశాంక్ ప్రధాన్పై ఏకపక్షంగా ఆధిపత్యం ప్రదర్శించి విజయాన్నందుకున్నాడు.
అమిత్ మహ్మద్ ఆరిఫ్పై గెలుపొంది అంకిత్తో పోరుకు సిద్ధమయ్యాడు. సంజీత్ ఆర్ఎస్పిబికి చెందిన నమన్ తన్వర్పై విజయాన్ని సాధించి ఏకగ్రీవంగా గెలుపొందాడు. ఎస్ఎస్సిబికి చెందిన బరున్ సింగ్, పవన్, సచిన్, ఆకాశ్, వంశజ్, రజత్, ఆకాష్, దీపక్, లక్ష్యకూడా సెమీస్కు చేరుకున్నారు.