హైదరాబాద్, ఆట ప్రతినిధి: గచ్చిబౌలి పుల్లెల గోపీచంద్ అకాడమీ వేదికగా గురువారం ఆల్ఇండియా సబ్జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నీలో పలు రాష్ర్టాలకు చెందిన యువ ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ ‘ప్రతీ ప్లేయర్ గెలుపు, ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలి. గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోకుండా కెరీర్ కొనసాగించాలి. ఆటలో ఎత్తుపల్లాలు సహజం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రమణ్యం, శ్రీనివాసగుప్తా, శ్రీనివాస్రావు పాల్గొన్నారు.