Naomi Osaka : నాలుగుసార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్ నవామి ఒసాకా(Naomi Osaka) మళ్లీ రాకెట్ పట్టనుంది. బిడ్డ కోసం టెన్నిస్కు విరామం ప్రకటించిన ఆమె.. కోర్టులో ప్రత్యర్థులను మట్టికరిపించేందుకు సిద్దమవుతోంది. బ్రిస్బేన్ అంతర్జాతీయ వామప్ టోర్నమెంట్(Brisbane International warm-up tournament)తో ఒసాకా పునరగామనం చేయనుంది. డిసెంబర్ 13 నుంచి జనవరి 7వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో ఒసాకా పాల్గొంటుందని నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు.
వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ లక్ష్యంగా ఓసాకా సాధన చేయనుంది. మళ్లీ రాకెట్ పట్టి కోర్టులో అడుగపెట్టుతున్నందుకు, పోటీ పడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. బ్రిస్బేన్లో పునరాగమనం చేయాలనుకున్నా. ఆ క్షణం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా అని ఒసాకా తెలిపింది.
నిరుడు ఆస్ట్రేలియన్ ఓపెన్కు ముందు ఒసాకా ఆట నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్. ఈ ఏడాది జూలైలో ఒసాకా.. షాయ్(Shai) అనే అడపిల్లకు జన్మనిచ్చింది. ఇన్ని రోజులు పాపతో గడిపిన ఆమె మళ్లీ రాకెట్ పట్టేందుకు సిద్ధమవుతోంది.
ఒసాకా సొంతదేశం జపాన్. ఆమెకు మూడు ఏండ్ల వయసులోనే తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు. అక్కడే పెరిగిన ఒసాకా టెన్నిస్ను కెరీర్గా ఎంచుకుంది. అనతికాలంలోనే ఆసియా సంచలనంగా పేరొందిన ఒసాకా.. రెండేసి చొప్పున ఆస్ట్రేలియా ఓపెన్ (2019, 2021)), యూఎస్ ఓపెన్(2018, 2010) ట్రోఫీలు ఖాతాలో వేసుకుంది.