హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీజీ 20 లీగ్లో నల్లగొండ నైట్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్లో కరీంనగర్ చేతిలో ఓడిన ఆ జట్టు.. శుక్రవారం ఉప్పల్లో మెదక్ ఫాల్కన్స్ను 8 వికెట్లతో ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మెదక్ నిర్దేశించిన 181 పరుగుల ఛేదనలో నల్లగొండ బ్యాటర్ గౌరవ్ రెడ్డి (47 బంతుల్లో 9 సిక్స్లు, 6 ఫోర్లతో 101 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగిన వేళ ఆ జట్టు 16.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. వరంగల్ వారియర్స్, పాలమూరు స్ట్రైకర్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఫలితంగా ఇరు జట్లూ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.