మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 25: రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో నాగర్కర్నూల్ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. అన్ని విభాగాల్లో సత్తాచాటిన నాగర్కర్నూల్ అథ్లెట్లు 78 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. హనుమకొండ జిల్లా రన్నరప్ ట్రోఫీ కైవసం చేసుకుంది.
33 జిల్లాల నుంచి 1100 మంది పాల్గొన్న ఈ పోటీల నుంచి 84 మంది జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. గురువారం నాటి ముగింపు వేడుకల్లో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా అనదపు కలెక్టర్ రమేశ్ విజేతలకు బహుమతులు అందజేశారు.