ముంబై: రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్(Musheer Khan) టాప్ ఫామ్లో ఉన్నాడు. విదర్భతో జరుగుతున్న ఫైనల్లో అతను 136 రన్స్ చేశాడు. 326 బంతుల్లో 10 ఫోర్లతో అతను సెంచరీ చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్లో ముంబైకి 500 రన్స్ ఆధిక్యం దక్కింది. అయితే రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ కొట్టిన యువ ముంబై బ్యాటర్గా ముషీర్ ఖాన్ తన ఖాతాలో ఓ రికార్డు వేసుకున్నాడు. గతంలో ఆ రికార్డు సచిన్ పేరిట ఉంది. ముషీర్ సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న విషయం తెలిసిందే.
ముషీర్ ప్రస్తుతం వయసు 19 ఏళ్ల 14 రోజులు. ఇక సచిన్ టెండూల్కర్ 94-95 సీజన్లో రెండు సెంచరీలు చేశాడు. అయితే అప్పుడు సచిన్ వయసు 22 ఏళ్లు. ఈ సీజన్లో తమిళనాడుతో జరిగిన మ్యాచ్లోనూ ముషీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 131 బంతుల్లో అతను 55 రన్స్ చేశాడు. దాంట్లో ఆరు బౌండరీలు ఉన్నాయి. సెమీస్లో శార్దూల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ముంబైతో జరుగుతున్న ఫైనల్లో ఇవాళ నాలుగవ రోజు ఆటలో విదర్భ వికెట్ నష్టపోకుండా 51 రన్స్ చేసింది. ఆ జట్టుకు 538 రన్స్ టార్గెట్ ఇచ్చింది ముంబై. అథర్వ టైడే, ద్రువ్ షోరే ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు.