హైదరాబాద్తో రంజీ మ్యాచ్
ముంబై: టాపార్డర్ రాణించడంతో హైదరాబాద్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ముంబై భారీ స్కోరు దిశగా సాగుతున్నది. గ్రూప్-‘బి’లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై మంగళవారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 457 పరుగులు చేసింది. కెప్టెన్ రహానే (139 బ్యాటింగ్; 18 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (162; 27 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్ (80 బంతుల్లో 90; 15 ఫోర్లు, ఒక సిక్సర్) మెరుపులు మెరిపించాడు. సూర్యకుమార్ పొట్టి ఫార్మాట్ ఫామ్ను కొనసాగిస్తూ దంచికొట్టాడు. రహానేతో పాటు సర్ఫరాజ్ ఖాన్ (40) క్రీజులో ఉన్నాడు.