WPL 2024 | ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్-2024) రెండో సీజన్లో ఆదివారం గుజరాత్ జెయింట్స్ టీంతో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 127 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్.. మరో 11 బంతులు ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి 129 పరుగులతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ సారధి హర్మన్ ప్రీత్ కౌర్ 46 పరుగులు నాటౌట్ గా నిలిస్తే, అమీలా కేర్ 31 పరుగులు, నాట్ స్కివర్ బ్రంట్ 22 పరుగులు చేశారు. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో తనుజా కన్వర్ రెండు, క్యాత్రిన్ బ్రైస్, లియా తాహుహు చెరో వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ టీం నిర్దిష్ట 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన బీత్ మూనీ 24 పరుగులు చేసినా వేద క్రుష్ణమూర్తి ఇస్మాయిల్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూతో సింగిల్ పరుగు తీయకుండానే పెవిలియన్ దారి పట్టాడు. మిగతా వారిలో తనుజా కన్వర్ 28, క్యాత్రిన్ బ్రైస్ 25 (నాటౌట్), అశైగ్ గార్డనర్ 15 పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమేలా కేర్ నాలుగు, షబ్నం ఇస్మాయిల్ మూడు, నట్ స్కివర్ బ్రంట్, హేలీ మాథ్యూస్ చెరొక వికెట్ తీశారు.