MI vs RCB : స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యస్తిక భాటియా(30)ను శ్రేయాంక పాటిల్ ఔట్ చేసింది. మిడాఫ్లో స్మృతి మంధాన సూపర్ క్యాచ్ పట్టడంతో యస్తిక వెనుదిరిగింది. ప్రస్తుతం హేలీ మాథ్యూస్ (20), నాట్ సీవర్ బ్రంట్ (0) క్రీజులో ఉన్నారు. పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి 84 బంతుల్లో73 పరగులు కావాలి.
తొలి రెండు ఓవర్లలో నిదానంగా ఆడిన ముంబై ఓపెనర్లు యస్తిక, మాథ్యూస్ ఆ తర్వాత దూకుడు పెంచారు. అలిసా పెర్రీ వేసిన ఐదో ఓవర్లో యస్తిక మూడు బౌండరీలు కొట్టింది. అంతకుముందు స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ వేసిన నాలుగో ఓవర్లో యస్తిక రెండు బౌండరీలు కొట్టింది. రెండో ఓవర్లో సోఫీ డెవినే రెండు నో బాల్స్ వేసింది. ఫ్రీ హిట్కు మాథ్యూస్ భారీ సిక్సర్ బాదింది. ఆఖరి బంతికి కీపర్ రీచాకు క్యాచ్ ఇచ్చింది. కానీ, అది నోబాల్ కావడంతో ఆమె బతికి పోయింది.
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చేతులెత్తేశారు. 9 వికెట్ల నష్టానికి 125 రన్స్ చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (24) మరోసారి నిరాశ పరిచింది. రీచా ఘోష్(29), అలిసా పెర్రీ (29) మాత్రమే రాణించారు. ముంబై బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీసి ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టారు. అయితే.. చివర్లో రీచా ఘోష్ ధాటిగా ఆడడంతో ఆర్సీబీ ఆమాత్రం స్కోర్ చేయగలిగింది. ముంబై బౌలర్లలో అమేలియా కేర్ మూడు వికెట్లు పడగొట్టింది. నాట్ సీవర్ బ్రంట్, ఇసీ వాంగ్ చెరో రెండు వికెట్లు తీశారు. సైకా ఇషాక్కు ఒక వికెట్ దక్కింది.