ఐపీఎల్ 14లో భాగంగా దుబాయ్లో జరుగుతున్న మ్యాచ్లలో ఈరోజు ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య పోరు ప్రారంభం అయింది. ఇది 34వ మ్యాచ్. అబుదబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
టాస్ గెలిచిన కోల్కతా.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై బ్యాటింగ్ బరిలోకి దిగింది. గాయం కారణంగా తప్పుకున్న రోహిత్ శర్మ.. తిరిగి ముంబై ఇండియన్స్ టీమ్తో జతకట్టాడు. కెప్టెన్గా బరిలోకి దిగాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, డీకాక్ బ్యాటింగ్కు దిగారు.
ముంబై ఇండియన్స్ టీమ్లో రోహిత్శర్మ, డీకాక్, ఎస్ యాదవ్, కిషన్, తివారీ, పొలార్డ్, పాండ్యా, చాహర్, మిల్నే, బుమ్రా, బౌల్ట్ ఉండగా.. కోల్కతా నుంచి గిల్, అయ్యర్, రానా, త్రిపాఠీ, రషెల్, మోర్గాన్, కార్తీక్, నరేన్, ఫెర్గుసన్, చక్రవర్తీ, కృష్ణ బరిలో ఉన్నారు.
5 ఓవర్లలో రోహిత్ శర్మ.. 19 బంతుల్లో 26 పరుగులు చేయగా.. డీకాక్ 11 బంతుల్లో 13 పరుగులు చేశాడు. కేకఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చాడు. సునీల్.. ఒక ఓవర్లో 11 పరుగులు, నితీశ్ రానా.. ఒక్క ఓవర్లో 5 పరుగులు ఇచ్చాడు. పెర్గుసన్ ఒక్క ఓవర్లో 11 పరుగులు ఇచ్చాడు. 5 ఓవర్లు ముగిసే సరికి.. ముంబై 40 పరుగులు చేసింది. రన్ రేట్ 8గా ఉంది.