ముంబై: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు.. దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ను హెడ్ కోచ్గా నియమించింది. ఈ ఏడాది వరకు లంక దిగ్గజం మహేళ జయవర్ధనే ఆ బాధ్యతల్లో కొనసాగగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని బౌచర్ భర్తీ చేయనున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు హెడ్ కోచ్గా కొనసాగుతున్న బౌచర్.. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. ‘ముంబై జట్టు హెడ్ కోచ్గా ఎంపికవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుతో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని బౌచర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
పంజాబ్ కోచ్గా బేలీస్
గత కొన్ని సీజన్లుగా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న పంజాబ్ కింగ్స్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఇప్పటి వరకు ఆ జట్టుకు భారత స్పిన్ దిగ్గ జం అనిల్ కుంబ్లే కోచ్గా వ్యవహరించగా.. తాజాగా అతడి స్థానంలో ట్రేవర్ బేలీస్ను ఎంపిక చేసుకుంది.