టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ కొత్త అవతారమెత్తాడు. క్రికెటర్గా తన హెలికాప్టర్ షాట్తో అభిమానులను అలరించిన ధోనీ తాజాగా టెన్నిస్ కోర్టులోకి దిగాడు. ఆట ఏదైనా విజయం తనదే అన్నట్టు..ఫైనల్లో విజయం సాధించి, ట్రోఫీ అందుకున్నాడు. జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్వర్యంలో నిర్వహించిన టెన్నిస్ ఛాంపియన్షిప్ 2022లో ధోనీ, సుమిత్ కుమార్ బజాజ్ జోడీ డబుల్స్ విజేతగా నిలిచింది.
గురువారం జరిగిన ఫైనల్ ధోనీ జోడీ, ప్రత్యర్థి జోడీ కంటే నాలుగు పాయింట్లు ఆధిక్యంలో ఉంది. అప్పటికే వెలుతురు తగ్గిపోవడంతో ఆటను నిలిపి వేసిన నిర్వాహకులు ధోనీ జోడీని విజేతగా ప్రకటించారు.
ధోనీ డబుల్స్ ట్రోఫీ అందుకున్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఎంఎస్డీ హాబీలు.. బైక్లు కలెక్ట్ చేయడం, ట్రోఫీలు గెలవడం’ అని ఒక యూజర్ స్పందించాడు. ‘ఏ ఆటలో అయినా విజేత నువ్వే’ అని మరో యూజర్ కామెంట్ పెట్టాడు.
ధోనీ కెప్టెన్సీలో భారజట్టు 2007లో టీ 20 వరల్డ్కప్ సాధించడమే కాకుండా 2011లో వన్డే ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ నాయకత్వంలో ఐపీఎల్లో ఇప్పటివరకు నాలుగు ఐపీఎల్ టైటిల్స్ సాధించింది. ఈమధ్యే ధోనీ ‘అథర్వ’ అనే మైథలాజికల్ సైన్స్ఫిక్షన్ యానిమేషన్ సిరీస్లో నటించాడు.