దుబాయ్: ఎమ్మెస్ ధోనీ( Dhoni ).. 18 ఏళ్లుగా ఇండియన్ క్రికెట్లో సంచలనాలు సృష్టించిన, సృష్టిస్తున్న పేరిది. విధ్వంసకర బ్యాటర్గా టీమ్లో అడుగుపెట్టి.. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఎదిగిన అతడు.. వరసగా ఒక్కో ఫార్మాట్కూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక మిగిలింది ఒక్క ఐపీఎల్ మాత్రమే. వచ్చే సీజన్లో ఈ లీగ్ నుంచీ తప్పుకోనున్నట్లు అతడు చెప్పకనే చెప్పాడు. అయితే తాజాగా ఇండియా సిమెంట్స్ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్లో ధోనీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కనీసం మరో సీజన్ తాను పసుపు రంగు జెర్సీలో కనిపించబోతున్నట్లు ధోనీ స్పష్టం చేశాడు. అంతేకాదు తన ఫేర్వెల్ గేమ్ విజిల్ పోడు ఆర్మీ ముందు చెన్నైలోనే జరుగుతుందని కూడా అతడు చెప్పడం విశేషం. ఫేర్వెల్ గేమ్ గురించి చెప్పాలంటే.. మీరు నన్ను ఇప్పటికీ సీఎస్కేకు ఆడుతుంటే చూస్తారు. ఫేర్వెల్ చెప్పే అవకాశం మీకు ఉంది. అది చెన్నైలోనే ఆడితే బాగుంటుందని అనుకుంటున్నాను. అక్కడ అభిమానులను కలుస్తా అని ధోనీ అన్నాడు.
అటు చెన్నై కూడా మెగా వేలానికి ముందు ముగ్గురు ప్లేయర్స్ను రిటేన్ చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ధోనీ, జడేజా, రుతురాజ్ గైక్వాడ్లు టీమ్తోనే ఉండనున్నారు. 2019లో చివరిసారి చెన్నైలో ఆడిన ధోనీ.. ఆ తర్వాత ఆడలేదు. గతేడాది యూఏఈలో టోర్నీ జరగగా.. ఈ ఏడాది తొలి అంచె ఇండియాలో జరిగినా తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో చెన్నైలో మ్యాచ్లు జరగలేదు.
ఈ సందర్భంగా రిటైర్మెంట్ తర్వాత బాలీవుడ్లో నటిస్తారా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ధోనీ స్పందించాడు. నటన అంత సులువు కాదని, తాను క్రికెట్తోనే కొనసాగుతానని చెప్పాడు. బాలీవుడ్ నాకు సరిపడదు. అడ్వర్టైజ్మెంట్ల వరకైతే ఓకే కానీ.. సినిమాలంటే అది చాలా కష్టమైన వృత్తి. అంత సులువు కాదు అని ధోనీ అభిప్రాయపడ్డాడు. ఆ పని తాను సినిమా స్టార్లకే వదిలేస్తున్నానని, తాను మాత్రం క్రికెట్తోనే ఉంటానని అన్నాడు.