TeamIndia : భారత జట్టులో స్టార్ ఆటగాళ్లు, పవర్ హిట్టర్లు, ఆల్రౌండర్లకు కొదవ లేదు. ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series)లలో మనోళ్లకు తిరుగు లేదు. కానీ, కానీ, ఐసీసీ ట్రోఫీ(ICC Trophy) ఫైనల్లో మాత్రం చేతులెత్తేస్తారు. అవును.. టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచి నేటికి పదేళ్లు అవుతోంది. 2013లో సరిగ్గా ఇదే రోజు టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) చాంపియన్గా అవతరించింది. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) సారథ్యంలోని యువ భారత్ ఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించింది.
ఉత్కంఠభరితంగా జరిగిన టైటిల్ పోరులో 5 పరుగుల తేడాతో నెగ్గింది. దాంతో.. టీ20, వన్డేల్లో అన్ని ఐసీసీ ట్రోఫీలు సాధించిన కెప్టెన్గా ధోనీ రికార్డు సృష్టించాడు. ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ భారత్కు 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ అందించాడు.
#OnThisDay in 2️⃣0️⃣1️⃣3️⃣
The @msdhoni-led #TeamIndia, beat England to lift the ICC Champions Trophy. 🏆
MS Dhoni became the first Captain (in Men’s cricket) to win all three ICC trophies in limited-overs cricket 👏🏻👏🏻 pic.twitter.com/x4le09coFM
— BCCI (@BCCI) June 23, 2023
బర్మింగ్హమ్లో జరిగిన ఫైనల్లో మొదట టీమిండియా 7 వికెట్ల నష్టానికి 127 రన్స్ కొట్టింది. విరాట్ కోహ్లీ(Virat Kohli) 43 టాప్ స్కోరర్. ఆ తర్వాత ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్ తలా రెండేసి వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్ 124 పరుగులకే పరిమితమైంది. ఇయాన్ మోర్గాన్ 33 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత జట్టు విజయానికి 10 ఏళ్లు పూర్తికావడంతో బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది.
భారత జట్టు ఐసీసీ ఫైనల్లో గెలిచి ఇప్పటికి పదేళ్లు అవుతోంది. 2014లో పొట్టి ప్రపంచ కప్ ఫైనల్కు చేరింది. కానీ, కుమార సంగక్కర (52) అర్ధ సెంచరీ కొట్టి లంకను గెలిపించాడు. 2017 చాంపియన్స్ట్రోఫీలోనూ పాకిస్థాన్ చేతిలో ఓటమి ఎదురైంది. 2021-22, 2022 -23లో వరుసగా రెండుసార్లు టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final) చేరింది.
కానీ, అనూహ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అయితే.. ఈఏడాది వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) రూపంలో అద్బుత అవకాశ రాబోతోంది. అది కూడా సొంత గడ్డపై జరగనుంది. దాంతో, ఈ మెగా టోర్నీలో కప్పు కొట్టి.. 10 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ప్రస్తుతం ఆటగాళ్లు సూపర్ ఫామ్లో ఉన్నారు. వరల్డ్ కప్లోనూ అదే జోరు కొనసాగిస్తే ట్రోఫీని ముద్దాడడం ఖాయం.