MS Dhoni Fans | ఎంఎస్ ధోనీ (MS Dhoni).. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో ఎంతో కూల్గా కనిపిస్తూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటాడు. తన ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అయితే ధోనీని దేవుడితో సమానంగా కొలుస్తుంటారు. మిస్టర్ కూల్ మ్యాచ్ ఆడుతున్నాడంటే అతని ఫ్యాన్స్తో మైదానం కిక్కిరిపోవాల్సిందే.
ఆదివారం ఐపీఎల్ చివరి మ్యాచ్లో కూడా ఇదే రిపీట్ అయ్యింది.ఈ ఐపీఎల్ (IPL) సీజన్ ధోనీ చివరిది కావొచ్చన్న ఊహాగానాల మధ్య తమ అభిమాన క్రికెటర్ను చూసేందుకు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన సీఎస్కే ఫ్యాన్స్తో స్టేడియం పరిసరాలు పసుపు మయం అయ్యాయి.
ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. మ్యాచ్ రిజర్వ్ డేకి వాయిదా పడటంతో అహ్మదాబాద్ తరలి వచ్చిన వేలాది మంది సీఎస్కే అభిమానులు (CSK Fans) తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి వరకూ మ్యాచ్ జరుగుతుందన్న ఆశతో నిరీక్షించారు. కానీ వరుణుడు కరుణించపోవడంతో నిరాశ చెందారు. ఈ రోజు ఫైనల్ జరగనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు స్టేడియాన్ని వీడి.. అర్ధరాత్రి సమయంలో ఎటు వెళ్లాలో తెలియక అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ (Ahmedabad Railway Station)కు చేరుకొన్నారు. అక్కడ నేలపైనే నిద్రించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
భారీ వర్షం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ ఫైనల్ నేటికి వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా తుదిపోరును రిజర్వ్ డే (సోమవారం)కు మార్చారు. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్కు సిద్ధమవుతున్న సమయంలో అహ్మదాబాద్లో భారీ వర్షం కురిసింది. అప్పుడప్పుడు వరుణుడు కాస్త శాంతించినట్లు కనిపించడంతో నిర్వాహకులు మ్యాచ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినా.. తిరిగి వర్షం మొదలవడంతో అది సాధ్యపడలేదు.
పలుసార్లు పరిశీలించిన అనంతరం మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోవడంతో ఇరు జట్ల కోచ్లతో మాట్లాడిన అనంతరం రాత్రి 11 గంటలకు మ్యాచ్ రెఫరీ జవగల్ శ్రీనాథ్ మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు.. వాటితోనే సోమవారం మ్యాచ్కు హాజరుకావొచ్చని అధికారులు వెల్లడించారు. సోమవారం కూడా వర్షం కారణంగా మ్యాచ్ సాగకపోతే.. లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన గుజరాత్ టైటాన్స్ను విజేతగా ప్రకటించనున్నారు.
It is 3 o'clock in the night when I went to Ahmedabad railway station, I saw people wearing jersey of csk team, some were sleeping, some were awake, some people, I asked them what they are doing, they said we have come only to see MS Dhoni @IPL @ChennaiIPL #IPLFinal #Ahmedabad pic.twitter.com/ZJktgGcv8U
— Sumit kharat (@sumitkharat65) May 28, 2023
Also Read..
Mamata Banerjee | చాంపియన్ల పట్ల పోలీసుల తీరు సిగ్గుచేటు : మమతా బెనర్జీ
Wrestlers Protest | రెజ్లర్లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఢిల్లీ పోలీసుల తీరుపై మండిపడ్డ మల్లయోధులు