MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఇంట దీపావళి సంబురాలు ఘనంగా జరిగాయి. వెలుగుల పండుగ రోజున భార్య సాక్షి సింగ్, బంధుమిత్రులతో కలిసి మహీ సరదాగా గడిపారు. అయితే.. ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ ఎవరో తెలుసా..? ఇంకెవరు భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్.
ధోనీని పెద్దన్నలా భావించే పంత్ సంప్రదాయ దుస్తులు ధరించి దీపావళి వేడుకల్లో పాల్గొని తమ అనుబంధం ఎంత బలమైనదో మరోసారి చాటుకున్నాడు. మహీ భార్య సాక్షి ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. వైరల్ అవుతున్నాయి.
టీమిండియాకు ఆడుతున్న రోజుల నుంచి ధోనీ, పంత్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ వీరిద్దరూ పుట్టిన రోజు వేడుకలు, ఫ్యామిలీ ఫంక్షన్లలో తరచూ కలుస్తుంటారు. ఐపీఎల్ 16వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను ఐదోసారి చాంపియన్గా నిలిపిన మహీ.. వచ్చే సీజన్లో ఆడతాడా? లేదా కోచ్గా కొత్త అవతారం ఎత్తుతాడా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
సౌరభ్ గంగూలీ, పంత్
మరోవైపు పంత్ మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడు 2024 ఐపీఎల్లో ఆడే అవకాశం ఉంది. ఈ డాషింగ్ వికెట్ కీపర్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్(delhi capitals)కు సారథిగా వ్యవహరిస్తాడని టీమ్ డైరెక్టర్ సౌరభ్ గంగూలీ వెల్లడించినవ విషయం తెలిసిందే.