Cricket worst record | క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డ్ నమోదైంది. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా అండర్-16 స్థాయిలో జరిగిన ఒక మ్యాచ్లో ఈ చెత్త రికార్డు నమోదు కావడం విశేషం. ఎనిమిది మంది బ్యాటర్లు డకౌట్గా వెనుదిరిగి తమ జట్టును కుప్పకూల్చారు.
విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా సిక్కిం-మధ్యప్రదేశ్ జట్ల మధ్య పోటీ జరిగింది. సిక్కిం జట్టు కేవలం 6 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫాలో ఆన్ ఆడిన సిక్కిం జట్టు ఆరంటే ఆరే పరుగులు చేసి కుప్పకూలింది. మధ్యప్రదేశ్ బౌలర్ల దెబ్బకు సిక్కిం బ్యాటర్లు ఎనిమిది మంది డౌకట్గా వెనుదిరిగారు. అవనిష్ 4 పరుగులు, అక్షద్ 2 పరుగులు చేశాడు. దీంతో మధ్యప్రదేశ్ జట్టు సిక్కింపై 365 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిక్కిం జట్టు కేవలం 9.3 ఓవర్లు మాత్రమే ఆడింది.
తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు 8 వికెట్ల కోల్పోయి 414 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో మధ్యప్రదేశ్ కెప్టెన్ మనల్ చౌహాన్ 170 పరుగులతో అలరించంగా, ప్రతీక్ శుక్లా 86, ఆర్యన్ ఖుష్వా 43, హర్షిత్ యాదవ్ 43 పరుగులు చేయడంతో మధ్యప్రదేశ్కు భారీ స్కోరు లభించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన సిక్కిం జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 43 పరుగులు చేసింది.