Hyderabad | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ హుస్సేన్సాగర్ వేదికగా మంగళవారం నుంచి మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్నకు తెరలేవనుంది. ఫెడరేషన్ క్యాలెండర్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఈ ర్యాంకింగ్ ఈవెంట్లో జాతీయస్థాయి అగ్రశ్రేణి సెయిలర్లు పోటీపడబోతున్నారు. తొలిసారిగా అండర్-19 ఇంటర్నేషనల్ 420 మిక్స్డ్ క్లాస్ని టోర్నీలో పరిచయం చేస్తున్నారు. టోర్నీ విషయానికొస్తే హైదరాబాద్ యాచ్ క్లబ్కు చెందిన ధరణి లావేటి, నేవీ స్పోర్ట్స్ స్కూల్కు చెందిన వడ్ల మల్లేశ్, నాన్సి రాయ్, అనిరాజ్ టాప్సీడ్స్ బరిలోకి దిగుతున్నారు.
వీరికి తోడు దీక్షిత, లాహిరి పోటీకి సై అంటున్నారు. హుస్సేన్సాగర్ అలలపై తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇదిలా ఉంటే మాన్సూన్ రెగెట్టా రోలింగ్ ట్రోఫీతో పాటు ప్రతిష్ఠాత్మకమైన ఎస్హెచ్ బాబు స్మారక ట్రోఫీలను విజేతలకు అందించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.