మెహిదీపట్నం: నగరంలో హైదరాబాద్తో ఐపీఎల్ మ్యాచ్ ఆడేందుకు వచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టీమ్ సభ్యులకు మంగళవారం క్రికెటర్ సిరాజ్ ఇంటికి విందుకు వచ్చారు. గతంలో నానల్నగర్ అల్హస్నత్ కాలనీలో ఉండే సిరాజ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్లో నూతన ఇంటిలోకి మారారు.
ఈ నేపథ్యంలో తన నూతన గృహంలో ఆర్సీబీ టీమ్ క్రికెటర్లకు విందు ఏర్పాటు చేశారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు ప్లేయర్లు సందడి చేశారు.