దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో 729 ర్యాంకింగ్ పాయింట్లతో సిరాజ్..ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్), జోష్ హాజిల్వుడ్(ఆస్ట్రేలియా)ను దాటేసి నంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా దూసుకొచ్చి అతికొద్ది కాలంలోనే సిరాజ్ టాప్ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్లతో జరిగిన వన్డే సిరీస్లను భారత్ క్లీన్స్వీప్ చేయడంలో సిరాజ్ కీలకపాత్ర పోషించాడు.
ఆరంభంలోనే వికెట్లు పడగొడుతూ జట్టుకు విజయాలందించాడు. మ్యాచ్లు ఆడేకొద్దీ సిరాజ్ రాటుదేలుతాడన్న కెప్టెన్ రోహిత్ ప్రశంసలకు న్యాయం చేకూర్చుతూ ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్ దక్కించుకున్నాడు. కాగా మరో భారత బౌలర్ మహమ్మద్ షమీ 11 ర్యాంక్లు మెరుగుపరుచుకుని 32వ ర్యాంక్కు చేరుకున్నాడు. బ్యాటింగ్లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నంబరవన్ స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-10 ర్యాంకుల్లో ముగ్గురు భారత బ్యాటర్లు శుభ్మన్ గిల్(6), విరాట్ కోహ్లీ(7), రోహిత్ శర్మ(8) ఉన్నారు.