లక్నో: ఆస్ట్రేలియాతో వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన రోజు బౌలర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) తల్లి ఆస్పత్రిలో చేరారు. యూపీలోని అమ్రోహ జిల్లాలోని సహస్పుర్ గ్రామంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. షమీ తల్లి అనుమ్ ఆరాకు జ్వరం వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె బలహీనంగా కూడా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చెకప్ కోసం ఆమెను షమీ బంధువులు హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.
2023 వన్డే వరల్డ్కప్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా షమీ రికార్డును క్రియేట్ చేశాడు.ఈ టోర్నీలో అతను 10.70 యావరేజ్తో 24 వికెట్లు తీశాడు. కివీస్పై అతను 57 రన్స్ ఇచ్చి ఏడు వికెట్లు తీసుకున్నాడు. మూడుసార్లు అతను అయిదు వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటి వరకు మొత్తం 18 వరల్డ్కప్ మ్యాచ్లు ఆడిన షమీ.. వాటిల్లో మొత్తం 55 వికెట్లు తీసుకున్నాడు. వరల్డ్కప్ మ్యాచుల్లో నాలుగు సార్లు అయిదేసి వికెట్లు తీసుకున్న తొలి బౌలర్గా అతను రికార్డు క్రియేట్ చేశాడు. ఆసీస్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో షమీ కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు.