బెంగళూరు: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న మహ్మద్ షమీ..సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నిలకడగా రాణిస్తున్నాడు. బెంగళూరు వేదికగా చండీగఢ్తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ 1లో షమీ బంతితో పాటు బ్యాట్తోనూ రాణించి బెంగాల్ను క్వార్టర్స్ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.
మొదట బ్యాటింగ్లో 17 బంతుల్లోనే 3 బౌండరీలు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసిన షమీ.. 4 ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. ఈ మ్యాచ్లో బె ంగాల్ 159/9 పరుగులు చేయగా చండీగఢ్.. 156 పరుగులకే పరిమితమైంది.