రూ.50 వేల చెక్కు అందజేత
వేలేరు : దక్షిణాసియా బేస్బాల్ పోటీలకు ఎంపికైన మోడెం రిషికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అండగా నిలిచారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అయిన రిషి బేస్బాల్ క్రీడలో ప్రతిభ చాటుతున్నాడు. భూటాన్ వేదికగా వచ్చే నెల 9, 10 తేదీల్లో దక్షిణాసియా టోర్నీలో రిషి పోటీపడాపల్సి ఉంది. అయితే వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని స్థానిక జెడ్పీటీసీ సరితారెడ్డి..ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న రిషి గురించి తెలుసుకుని వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ పల్లా.. ప్రయాణ ఖర్చులకు 50వేల చెక్కు పంపించారు. బుధవారం పాఠశాలలో హెచ్ఎం దుర్గాభవానీ..విద్యార్థి రిషిని అభినందించి చెక్కు అందించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్రెడ్డికి రిషి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఈటీ సుమలతతో పాటు వైస్ ఎంపీపీ అంగోతు సంపత్, కో ఆప్షన్ సభ్యుడు జానీ, ఉపసర్పంచ్ గొవింద సురేశ్, మాజీ సర్పంచ్ భట్టు ప్రభాకర్ పాల్గొన్నారు.