న్యూఢిల్లీ: న్యూజిలాండ్లో జరగనున్న ఐసీసీ వుమెన్స్ వరల్డ్కప్కు .. టీమిండియా మహిళల జట్టును ఇవాళ బీసీసీఐ ప్రకటించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్.. వరల్డ్ కప్ జట్టుకు నాయకత్వం వహించనున్నది. మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు న్యూజిలాండ్ వేదికగా మహిళల వన్డే వరల్డ్కప్ జరగనున్నది. ఇండియా మార్చి ఆరవ తేదీన తన తొలి మ్యాచ్ను దాయాది పాకిస్థాన్తో తలపడనున్నది. తౌరంగలోని బే ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనున్నది. న్యూజిలాండ్తో జరిగే టీ20, వన్డే సిరీస్కు సంబంధించిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది.
ఆల్ ఇండియా వుమెన్స్ సెలక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసింది. అయితే స్టార్ డ్యాషింగ్ బ్యాటర్ జమిమా రోడ్రిక్స్ను వరల్డ్కప్కు ఎంపిక చేయలేదు. గత ఏడాది సరైన ఫామ్లో లేని కారణంగా ఆమెను పక్కనపెట్టారు. వరల్డ్కప్, కివీస్తో సిరీస్లకు హర్మన్ప్రీత్ కౌర్ డిప్యూటీ బాధ్యతలను చేపట్టనున్నది. సీనియర్లు స్మృతి మందానా, జూలన్ గోస్వామి, యంగ్స్టర్ షఫాలీ వర్మకు జట్టులో స్థానం దక్కింది. ఆల్రౌండర్ శికా పాండేను పక్కనపెట్టారు.
వరల్డ్కప్లో ఇండియా మార్చి 6న పాకిస్థాన్తో, 10న న్యూజిలాండ్తో, మార్చి 12న వెస్టిండీస్తో, 16న ఇంగ్లండ్తో, 19న ఆస్ట్రేలియాతో , 22న బంగ్లాదేశ్తో, 27న దక్షిణాఫ్రికాతో తలపడనున్నది.
2022 వరల్డ్కప్ జట్టు..
మిథాలీ రాజ్(కెప్టెన్), హర్మన్ప్రీత్ కౌర్(వైస్ కెప్టెన్), స్మృతీ మందానా, షఫాలీ వర్మ, యాస్టికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), స్నేహ రాణా, జూలన్ గోస్వామి, పూజా వస్త్రకార్, మేఘనా సింగ్, రేణుకా సింగ్ థాకూర్, తానియా భాటియా(వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.
స్టాండ్ బై ప్లేయర్లు: షబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్, సిమ్రన్ దిల్ బహదూర్
🚨 NEWS 🚨: India Women’s squad for ICC Women’s World Cup 2022 and New Zealand series announced. #TeamIndia #CWC22 #NZvIND
— BCCI Women (@BCCIWomen) January 6, 2022
More Details 🔽https://t.co/qdI6A8NBSH pic.twitter.com/rOZ8X7yRbV