హామిల్టన్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళ ప్రపంచకప్లో టీమ్ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj) రికార్డు సృష్టించింది. ప్రపంచకప్లో అత్యధిక మ్యాచుల్లో జట్టుకు నేతృత్వం వహించిన కెప్టెన్గా నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ పేరుతో ఉన్నది. బెలిండా 23 మ్యాచుల్లో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించింది. అయితే హామిల్టన్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్తో బెలిండాను మిథాలీ దాటేసింది. దీంతో మిథాలీ రాజ్ ప్రపంచకప్లో టీమ్ఇండియాకు 24 మ్యాచులో కెప్టెన్గా వ్యవహరిస్తున్నది.
ఇందులో మిథాలీ నేతృత్వంలోని టీమ్ఇండియా 14 విజయాలు సాధించగా, 8 మ్యాచుల్లో ఓడిపోయింది. మరో మ్యాచ్లో ఫలితం తేలలేదు. మిథాలీ తన చివరి ప్రపంచకప్ ఆడుతున్న విషయం తెలిసిందే.
కాగా, ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్లో జరుగుతున్న మ్యాచ్లో 21 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ప్రస్తుతం స్మితి మందన (32), హర్మన్ ప్రీత్కౌర్ (18) క్రీజ్లో ఉన్నారు. మిథాలీరాజ్ (5), దీప్తి శర్మ (15) స్వల్ప స్కోర్లకే వెనుతిరిగారు.