లండన్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్ (10,273 పరుగులు)ను అధిగమించింది. ఇంగ్లండ్తో మూడో వన్డేలో హైదరాబాదీ మిథాలీ (75 నాటౌట్) రాణించడంతో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి రెండు వన్డేల్లో ఓడి ఇప్పటికే సిరీస్ కోల్పోయిన మిథాలీ బృందం ఆఖరి మ్యాచ్లో నెగ్గి పరువు దక్కించుకుంది. డక్వర్త్లూయిస్ పద్ధితిలో సాగిన పోరులో ఇంగ్లండ్ నిర్ణీత 47 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 46.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.