IND vs AUS : విశాఖపట్నంలో జరగుతున్న రెండో వన్డేలో టీమిండియా 117 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగడంతో భారత్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆసీస్ పేసర్ల ధాటికి భారత టాప్ బ్యాటర్లు చేతులెత్తేశారు. రెండంకెల స్కోర్ చేసేందుకు కష్టపడ్డారు. 26వ ఓవర్ వేసిన స్టార్క్ ఆఖరి బంతికి సిరాజ్ను బౌల్డ్ చేయడంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. అంతకుముందు ఓవర్లో సియాన్ అబాట్ రెండు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ (4), మహమ్మద్ షమీ(0)ని ఔట్ చేశాడు. దాంతో, 103 రన్స్ వద్ద భారత్ తొమ్మిదో వికెట్ పడింది. ఆసీస్ బౌలర్లలో సియాన్ అబాట్ మూడు, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు తీశారు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. పిచ్ పేస్కు అనుకూలించడంతో ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చెలరేగిపోయాడు. టీమిండియా టాపార్డర్ను కూల్చాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్ శుభ్మన్ గిల్(0)ను ఔట్ చేసిన అతను ఆ తర్వాత ఒకే ఓవర్లో రోహిత్ శర్మ(13), సూర్యకుమార్ యాదవ్(0)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. కేఎల్ రాహుల్(9)ను ఔట్ చేసి భారత్ను ఒత్తిడిలోకి నెట్టాడు. కుదురుకున్న విరాట్ కోహ్లీ (31) ని ఎల్లిస్ ఎల్బీగా ఔట్ చేశాడు. అప్పటికి భారత్ స్కోర్..71.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో కష్ట సమయంలో భారత్ను ఆదుకున్నఆల్రౌండర్లు రవీంద్ర జడేజా (16), అక్షర్ పటేల్ (29) మరోసారి రాణించారు. దాంతో 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఒక దశలో 100 పరుగుల లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ, జడేజా, అక్షర్ పటేల్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీళ్లు ఏడో వికెట్కు రన్స్ జోడించారు. నాథన్ ఎల్లిస్ వేసిన 20 ఓవర్ మూడో బంతికి కీపర్ అలెక్స్ క్యారీ డౌవింగ్ క్యాచ్ పట్టడంతో జడ్డూ వెనుదిరిగాడు. జడేజా ఔటయ్యాక అక్షర్ టెయిలెండర్లతో కలిసి స్కోర్బోర్డు వంద దాటించాడు. స్టార్క్ వేసిన 26వ ఓవర్లో అతను లాంగాఫ్, మిడాఫ్లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన స్టార్క్ అరుదైన ఘతన సాధించాడు. వన్డేల్లో అత్యధికంగా 9 సార్లు ఐదు వికెట్లు తీసిన రెండో ఫాస్ట్ బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు. పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ (13 సార్లు) అగ్రస్థానంలో ఉన్నాడు.