న్యూఢిల్లీ: కొలంబియా వేదికగా డిసెంబర్ 5 నుంచి 16 వరకు జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ కోసం మంగళవారం భారత జట్టును ఎంపిక చేశారు. నలుగురు సభ్యుల బృందానికి స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను సారథ్యం వహించనుంది.
జట్టులో మీరాబాయి (49కి)తో పాటు బింద్యారాణిదేవి (59కి), అచింతా సెహులి (73కి), గురుదీప్సింగ్ (109+కి) ఉన్నారు. పారిస్ (2024) ఒలింపిక్స్కు తొలి సన్నాహక టోర్నీగా భావిస్తున్న వరల్డ్ చాంపియన్షిప్లో సత్తాచాటేందుకు భారత లిఫ్టర్లు తహతహలాడుతున్నారు.