హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) టిక్కెట్ల గొడవపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. టికెట్ల గందరగోళంపై రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చితే సీఎం కేసీఆర్ సహించరు అని మంత్రి స్పష్టం చేశారు. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల అవకతవకలపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. టికెట్లులో బ్లాక్లో అమ్మినట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. టికెట్ల విక్రయాలు పారదర్శకంగా జరగాలన్నారు. రేపు ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి ఉప్పల్ స్టేడియాన్ని పరిశీలిస్తామన్నారు. స్టేడియం సామర్థ్యం ఎంత? ఎన్ని టికెట్లు విక్రయించారనే దానిపై తేల్చుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.