కోల్కతా: భారత సీనియర్ ఆటగాడు, బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటలోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం వెల్లడించాడు. ఫామ్ లేమీ, గాయాల కారణంగా జాతీయ జట్టుకు దూరమైనా తివారీ.. బెంగాల్ తరఫున దేశవాళీల్లో పరుగుల వరద పారించాడు.
ఈ ఏడాది రంజీల్లోనూ ఆడిన 37 ఏండ్ల తివారీ ‘క్రికెట్కు గుడ్బై’ అంటూ సోషల్ మీడియా వేదికగా వీడ్కోలు సందేశాన్ని పంచుకున్నాడు. భారత్ తరఫున 12 వన్డేల్లో 287 పరుగులు చేసిన ఈ బెంగాల్ బ్యాటర్.. ఓ అంతర్జాతీయ శతకం తన పేరిట లిఖించుకున్నాడు.