హైదరాబాద్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ): భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పరామర్శించారు. అజారుద్దీన్ తండ్రి మహమ్మద్ అజీజుద్దీన్ సుధీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడి, ఈ నెల 18న తుదిశ్వాస విడిచారు.
శనివారం హైదరాబాద్లోని అజారుద్దీన్ నివాసానికి వెళ్లిన మంత్రి హరీశ్రావు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. అజర్తో పాటు కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలియజేశారు.