IPL auction: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కొడుకు మిలింద్ ఆనంద్కు వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడే అవకాశం దక్కింది. ఆదివారం నాటి ఐపీఎల్ మెగా వేలంలో మిలింద్ ఆనంద్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. విరాట్ కోహ్లీ టీమ్ అతడిని రూ.25 లక్షలకు దక్కించుకుంది.
చామ వి మిళింద్ ఆనంద్ హైదరాబాద్కు చెందిన ఎడమ చేతి బ్యాట్స్మెన్. అదేవిధంగా ఎడమ చేతి మీడియం బౌలర్గా రాణిస్తున్నాడు. ఈ 20 ఏండ్ల యువకుడు గతంలో కూడా ఐపీఎల్లో ఆడాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున అతను ఐపీఎల్లో పార్టిసిపేట్ చేశాడు. అంతేగాక హైదరాబాద్ జట్టు, టీమిండియా అండర్-19 జట్టులో కూడా మిలింద్ సభ్యుడిగా ఉన్నాడు.
మిలింద్ ఆనంద్ అరోరా డిగ్రీ కళాశాలలో చదివాడు. ఆసీస్ లెఫ్ట్ ఆర్మర్ మిచెల్ జాన్సన్, చిచ్చరపిడుగు వీరేంద్ర సెహ్వాగ్ మిలింద్ ఆరాధ్య క్రికెటర్లు. ఆర్డర్ డౌన్లో ఇతను చాలా చక్కగా రాణిస్తున్నాడు. భారత అండర్-19 జట్టులోనూ ఆడిన మిలింద్ ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 53 మ్యాచ్లు ఆడిన మిలింద్ 83 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఐపీఎల్-2022 సీజన్ మార్చి చివరి వారంలో ప్రారంభమవుతుందని బీసీసీ కార్యదర్శి జై షా తెలిపారు.