ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ
కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో అతడు ఆదివారం స్వదేశానికి వెళ్లే అవకాశం ఉంది.
అక్కడికి వెళ్లిన తర్వాత క్వారంటైన్లో ఉండనున్నాడు.
గత శనివారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో హస్సీకి నెగెటివ్ వచ్చింది. మళ్లీ
సోమవారం రెండోసారి టెస్ట్ చేయగా పాజిటివ్గా తేలడంతో చెన్నైలోనే ఐసోలేషన్లో ఉన్నాడు.
ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదాపడిన సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహాతో పాటు హస్సీకి కొవిడ్-19 పాజిటివ్గా తేలింది.
‘ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో హస్సీకి నెగెటివ్ వచ్చింది. అతను పూర్తిగా కోలుకున్నాడు. మాల్దీవుల మీదుగా లేదా నేరుగా ఆస్ట్రేలియాకు.. తను తిరిగి ఇంటి ఎలా వెళ్తాడో ఇంకా నిర్ణయించలేదని’ సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు.