చెన్నై: విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుడ్న్యూస్. సన్రైజర్స్ హైదరాబాద్తో జరగబోయే మ్యాచ్కు ఆ జట్టు స్టార్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సెన్ తెలిపారు. బుధవారం రాత్రి బెంగళూరు, హైదరాబాద్ జట్లు చెపాక్ మైదానంలో తలపడనున్నాయి.
కరోనా నుంచి పడిక్కల్ ఇటీవలే కోలుకున్నాడు. విశ్రాంతి తీసుకోమని టీమ్ మేనేజ్మెంట్ సలహా ఇవ్వడంతో పడిక్కల్..ముంబై ఇండియన్స్తో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్కు దూరమయ్యాడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన సీజన్లో పడిక్కల్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2021 ఆరంభానికి ముందు పడిక్కల్కు కరోనా పాజిటివ్గా తేలింది. హోం క్వారంటైన్లో ఉంటూనే కోలుకున్నాడు. ఆ తర్వాత నిర్వహించిన మూడు కొవిడ్-19 టెస్టుల్లో నెగెటివ్ రావడంతో చెన్నైలోని ఆర్సీబీ టీమ్ బబుల్లోకి వచ్చాడు.